జార్ఖండ్లో రైల్వేకు చెందిన రైలు బోగీలు కనిపించకుండా పోవడం అధికారులను షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రీమియం రైళ్ల కోసం రాంచీ రైల్వేస్టేషన్కు అధికారులు ఆధునిక బోగీలను తెప్పించారు. ఢిల్లీ-రాంచీల మధ్య నడిచే రైళ్లకు వీటిని అమర్చాలని అధికారులు భావించి వాటిని స్టేషన్ యార్డులో ఉంచారు. అయితే, అవి అక్కడి నుంచి కనిపించకుండా పోవడంతో వారు అవాక్కయ్యారు. రాజధాని ఎక్స్ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం ఈ బోగీలను తెప్పించినట్లు జాతీయ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.