ఏపీ బీజేపీ నేతలతో అమిత్షా నివాసంలో జరిగిన భేటీకి జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్... బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయ్యారు. ఈ భేటీకి హాజరైన ప్రశాంత్ కిషోర్... ఏపీలో పార్టీ పరిస్థితులపై వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.