నిన్నటి వరకు దేశం చూపులు ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూశారు. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరికి అందని స్పీడూతో టాప్ గేర్లో దూసుకపోయి తెలంగాణ గడ్డపై గూలాబీ జెండా ఎగరవేసింది అయితే మరో వైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీకి ఓటర్లు భారీ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ప్రజలు. దింతో ఈ విషయంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఇది దేశపౌరుల మన్ కీ బాత్ అని ఆయన అన్నారు. వరుస ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు బై బై చెబుతున్నారన్నారు. మీ అందరికీ ఓటమికి గల కారణాలేమిటో తెలుసా..? లేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు.. అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.