వైసీపీ అధినేత వైయస్ జగన్ ను సినీనటుడు పోసాని కృష్ణమురళి కలిశారు.శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆకివీడు వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు వద్ద పోసాని కలిశారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. శనివారం ఆకివీడు శివారు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. కుప్పన పుడి, కోలనపల్లి మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొనసాగించి మధ్య్నహం అక్కడే విరామం తీసుకుంటారు. జక్కారంలో ఇవాళ్టి పాదయాత్ర ముగించి అక్కడే రాత్రికి బస చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.