మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం వంద రూపాయల నాణాన్ని విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాల్గొన్నారు. ఒక వ్యక్తిగా వాజ్ పేయికి ఎవరూ సాటిలేరన్నారు ప్రధాని మోడీ. దేశంలోనే ఓ గొప్ప వాగ్దాటి కలిగిన నేత అని అన్నారు. వాజ్ పేయి ఎప్పుడు జాతి అవసరాల కోసమే మాట్లాడారని.. పార్టీ భావజాం కోసం ఎప్పుడు వెనక్కి తగ్గలేదన్నారు.