కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. చెన్నై చేరుకున్న ప్రధాని మోడీ రాజాజీ హాల్కు వెళ్లి, అక్కడ కరుణ పార్థివదేహాన్ని దర్శించి, అంజలి ఘటించారు. కరుణానిధి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. స్టాలిన్, కనిమొళిని ప్రధాని ఓదార్చారు. కరుణానిధి పార్థివదేహానికి ప్రధానితో పాటు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నివాళులర్పించారు.