గత పదిరోజులుగా వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి ఆయిల్ కంపెనీలు. రోజుకోవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నాయి.తాజాగా అవి తగ్గుముఖం పట్టనున్నట్టు తెలుస్తోంది. అదికూడా 10 రోజుల్లో అతిపెద్ద తగ్గింపు నేడు జరగనున్నట్టు ఇండియన్ ఆయిల్ కంపెనీ వెబ్సైటులో పేర్కొంది. లీటరు పెట్రోల్పై 21 పైసలు, లీటరు డీజిల్పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో 21 పైసలు తగ్గి 77.42గా... లీటరు డీజిల్ ధర 15 పైసలు తగ్గి 68.58గా నమోదైంది. ఇదిలావుంటే లీటరు పెట్రోల్ ధర ముంబైలో రూ.85.45గా, కోల్కతాలో రూ.80.28గా, హైదరాబాద్ లో రూ.82 ,చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి.