జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటనల మీద పర్యటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.. మొదటిరోజు విశాఖలో, మొన్న పోలవరం, నిన్న విజయవాడలో పర్యటించిన అయన పలు రకాల సమశ్యలపై స్పందించారు.. ఆయన పర్యటనలో భాగంగా నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. పడవ బోల్తా పడి మృతిచెందిన కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు.