ప్రారంభమైన పవన్ బస్సు యాత్ర ..రోజుకు రెండు..

Update: 2018-05-20 07:21 GMT

సమస్యల అధ్యయనం, ప్రత్యేకహోదా నినాదం, విభజన హామీల అమలుకై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పవన్ తన యాత్ర ప్రారంభించారు. రోజుకు రెండు నియోజకవర్గల్లో పవన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో  విద్యార్థులు నిపుణులతో కలిసి చర్చలో పాల్గొంటారు. తొలిరోజు  ఇచ్చాపురం, కవిటి, వరివంక, శ్రీరాంపురం, కంచిలీ, సొంపేట, బారువాల మీదుగా బస్సు యాత్ర సాగనుందని పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి. 

Similar News