సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి కంట తడిపెట్టారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్లో పేరు లేకపోడంతో నిరాశగా ఢిల్లీ నుంచి సూర్యాపేట చేరుకున్న పటేల్ రమేష్రెడ్డి తన అనుచరులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తర్వాత కృష్ణానగర్ కాలనీలోని తన నివాసానికి చేరుకున్న రమేష్రెడ్డి అక్కడికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను చూసి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి లావణ్యారెడ్డి, ఆయన సోదరుడు, ప్రవాసాంధ్రుడు పటేల్ శ్రీధర్రెడ్డిలు దగ్గరకు రాగానే ఒక్కసారిగా వారిని హత్తుకుని కంట తడి పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు సైతం ఉద్వేగానికి లోనై ఆయనను ఆలింగనం చేసుకుని బాధను పంచుకున్నారు. మరోవైపు ఆయన నివాసం ముందు శరత్ అనే అభిమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడ ఉన్న వారు అడ్డుకుని వారించారు.