ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవాలని పాకిస్థాన్ చేస్తున్న దుష్ట ప్రయత్నాలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నిప్పులు చెరిగారు. ఇన్ఫ్యాంట్రీ డే ను పురస్కరించుకుని ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ నివాళులర్పించిన ఆయన పాక్ కుయుక్తులు పారవని హెచ్చరించారు. ఉగ్రదాడులు ద్వారా విజయం సాధించలేమన్న విషయం పాకిస్థాన్కు కూడా బాగా తెలుసునని అన్నారు. కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు పాకిస్థాన్ చేసే ప్రయత్నాలన్నింటినీ అంతే దీటుగా తిప్పికొడతామని... ఎలాంటి ఆపరేషన్లు చేపట్టడానికైనా తాము సంసిద్ధతంగా ఉన్నామన్నారు.