అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీకి శాపం తగులుతుందని వ్యాఖ్యానించిన మీరు ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ పక్కన కూర్చున్నారో, అప్పుడే మీకు శాపం తగిలినట్టు అని రాకేశ్ సింగ్ అన్నారు. ప్రజలు వెలేసేది బీజేపీని కాదని టీడీపీనేనని ఈ విషయం తొందర్లోనే తెలుస్తుందని రాకేశ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని దేశమంతా చూశారని రాకేశ్ సింగ్ గుర్తుచేశారు.