నామినేషన్ల దాఖలకు తుది గడవు సమీపిస్తున్నా టీజేఎస్లో అభ్యర్ధుల ఎంపిక కొలిక్కి రాలేదు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఎనిమిది స్ధానాలు దక్కించుకున్న టీజేఎస్ ఇప్పటి వరకు నాలుగు స్ధానాలకు మాత్రమే అభ్యర్ధులను ఖరారు చేసింది. మిగిలిన నాలుగు స్ధానాలపై అటు టీజేఎస్లోనూ ఇటు కాంగ్రెస్లోనూ క్లారీటీ రాలేదు. దీంతో ఏయే స్ధానాల్లో ఎవరెవరితో పోటీ చేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జనగాం బరి నుంచి కోదండరాం తప్పుకున్నారు.