రానున్న సార్వత్రి ఎన్నికల్లో తాను భారత ప్రధాని అభ్యర్ధిగా ముందుకు రాబోనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పుుడు ఉన్న పదవితోనే తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని నితిన్ తెలిపారు. రానున్న 2019 ఎన్నికల్లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ స్థానంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీనే ప్రకటించాలని మహారాష్ట్ర రైతు నేత, వసంత్రావు నాయక్ సేఠి స్వావలంబన్ మిషన్ చైర్మన్ కిషోర్ తివారీ ఆరెస్సెస్ చీఫ్కు లేఖ రాశారు. 2019లో మళ్లి తిరిగి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టలంటే నితిన్ గడ్కరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నితిన్ గడ్కరికి ప్రధాని అభ్యర్థిత్వంపై అసలు ఆసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి తానకు ఉన్న బాధ్యతలో గంగా నదీ ప్రక్షాళన పనుల చేయాలని ఇంకా కొన్ని పనుల్లో తాను బీజిగా ఉన్నట్లు తెలిపారు.