కూటమిపై ప్రజలకు విశ్వాసం లేదు..

Update: 2018-12-02 08:56 GMT

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం కీలకదశకు చేరుకోవడంతో భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. పార్టీ అభ్యర్థులకు ప్రచారం కోసం పలు నియోజకవర్గాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ  ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో కలిసి ఆదివారం రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లపై విరుచుకపడ్డారు. అవకాశవాద పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదని, కేవలం స్వార్ధ రాజకీయాల కోసమే ప్రజకూటమిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పార్టీలేనని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు
 

Similar News