మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి అస్థికల యాత్రలో బీజేపీ నేత సెల్ఫీ తీసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. ఔరంగాబాద్ డిప్యూటీ మేయర్ విజయ్ ఔతడే అస్థికల యాత్ర సాగుతుండగా సెల్ఫీ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాజ్పేయి అస్థికల యాత్ర ముంబై నుంచి ఔరంగబాద్లోని ఉస్మాన్పురాకు చేరుకుని జల్నాకు వెళుతుండగా ఔతడే సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బీజేపీ నేత చర్యను తప్పుపట్టారు.