కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు: నాయిని

Update: 2018-11-21 11:03 GMT

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100పైగా సీట్లతో విజయభేరీ మోగిస్తుందని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. ఇక మ‍హాకూటమిపై నాయిని చమత్కరం చేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలోని అభ్యుర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తమ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు పట్టం కడతరాని ధీమావ్యక్తం చేశారు. డిండి ప్రాజేక్టు పథకంతో దేవరకొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. నేడు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో నాయిని ప్రసంగించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు లేఖలు రాసి అడ్డుకున్నారని నాయిని నర్సింహారెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమని నాయిని అన్నారు.

Similar News