ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్‌ కుమారుడు

Update: 2018-08-03 06:29 GMT

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్‌ ఖండించారు. కొందరు బాధిత అమ్మాయిలు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంపై స్పందించిన ఆయన... నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. శాంకరి నర్సింగ్‌ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి  సంజయ్‌ పేర్కొన్నారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు సంజయ్... విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారాయన.

Similar News