ఏపీలో వైసీపీదే అధికారం : బీజేపీ ఎమ్మెల్యే

Update: 2018-05-03 06:21 GMT

ఏపీలో వచ్చే ఎన్నికలో వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే. క్రమంగా టీడీపీ గ్రాఫ్ పడిపోతుందన్న ఆయన పాదయాత్రతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన సందర్బంగా  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు  ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ఏపీలో వైసీపీ విజయం ఖాయమని తేల్చేశారు. కాబోయే సీఎం జగనేనని ఢంకా భజాయించారు. అంతేకాదు..అవినీతికి టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విష్ణుకుమార్‌రాజు...  త్వరలోనే ఆ పార్టీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడి సీఎం చంద్రబాబుపై హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని వ్యాఖ్యానించారు.  

Similar News