తెలంగాణ టీడీపీలో మరో ముసలం చెలరేగింది. టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలతో తెలంగాణ తెలుగుదేశంలో గందరగోళం ఏర్పడింది. మోత్కుపల్లి వ్యాఖ్యలపై మండిపడుతోన్న టీడీపీపీ నేతలు విలీనం వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమంటూ కొట్టేశారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారంటున్న తెలంగాణ తెలుగుదేశం నేతలు మోత్కుపల్లిలాంటి నేతల వల్లే టీడీపీకి నష్టం జరుగుతోందని మండిపడుతున్నారు. ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అయితే తెలంగాణలో టీడీపీ ఎల్లకాలం ఉంటుందన్నారు.