భార్య బిడ్డను దారుణంగా హత్య చేసి ఆపై.. శవాలమధ్యే నిద్ర!

Update: 2018-05-26 05:10 GMT

భార్యా  కూతురిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి అనంతరం  వారితో రాత్రంతా నిద్రించి.. 
అనూహ్యంగా తాను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్ లో చోటుచేసుకుంది. మైసూర్ ప్రాంతానికి చెందిన ప్రజ్వల్, బెంగుళూరుకు చెందిన సవితను   వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాది నుంచే భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచు గొడవలు వస్తుండటంతో విసుగుచెందాడు ప్రజ్వల్.  ఈ క్రమంలో ఎలాగైన  భార్య,కూతురును  చంపాలనుకున్నాడు. పెళ్లి  రోజే  ఈ దారుణానికి  ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి పెళ్లిరోజు వేడుక ముంగించుకున్నాక అందరూ  నిద్రపోయారు.. ఆ సమయంలో  కత్తితో భార్య సవిత, కుమార్తె సించనలను గొంతుకోసి చంపాడు. ఆ తరువాత భార్యాబిడ్డల శవాలతోనే  రాత్రంతా నిద్రించాడు. పొద్దున్నే లేచి తన కుటుంబ సభ్యులకు ఈ ఘోరం గురించి తెలిపి, తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .

Similar News