ఒకే ఫ్రేమ్‌లో చెర్రీ, మహేష్.. ‘పిక్ ఆఫ్‌ ది డే’ అంటున్న అభిమానులు

Update: 2018-12-26 08:15 GMT

గత రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్టార్ హీరోలు ఫ్యామిలీస్‌ తో కలిసి సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, ఆయన కుమార్తె సితార, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అంతా కలిసి  క్రిస్మస్ వేడుకల్లో సందడి చేశారు. అంతా కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ పిక్స్‌ను ఉపాసన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మహేష్, చెర్రీ ఫ్యామిలీస్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చెర్రీ, మహేష్ కలిసి ఉన్న ఫోటోను ‘పిక్ ఆఫ్ ది డే’గా అభివర్ణిస్తూ అటు మెగా, ఇటు మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.

Similar News