మధ్యప్రదేశ్ ఎన్నికల పోలింగ్లో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ముగ్గురు సిబ్బంది ఆకస్మికంగా మృతి చెందారు. గుండెపోటుతో ఇండోర్లో ఇద్దరు, గుణలో ఒకరు మృతి చెందారు. ఎన్నికల సిబ్బంది మృతి పట్ల ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. ఒక్కొక్కరికి 10లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.