హైదరాబాద్లో లిక్కర్ చాక్లెట్ల మాఫియా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా బేగంబజార్, అబిడ్స్లో చాక్లెట్ల స్మగ్లింగ్కు పాల్పడుతోంది ముఠా. వెయ్యికి పైగా లిక్కర్ చాక్లెట్ల బాక్స్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు సంబంధించి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులే టార్గెట్గా లిక్కర్ చాక్లెట్ల మాఫియా దందా కొనసాగిస్తోంది.