నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే పార్టీని వీడుతానంటూ కోమటిరెడ్డి జారీ చేసిన అల్టిమేటానికి కాంగ్రెస్ అధిష్ఠానం దిగొచ్చింది. ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నకిరేకల్ సీటు విషయంలో ఎవరికీ హామీ ఇవ్వలేదని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోమటిరెడ్డిని బుజ్జగించినట్టు సమాచారం. కుంతియా బుజ్జగింపులతో మెత్తబడిని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా ఆలోచన నుంచి వెనక్కు తగ్గినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.