హైదరాబాద్లో స్థిరపడ్డ సీమాంధ్రులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నిజాంపేట్లో మన హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాలన సాగిందని చెప్పారు. తెలంగాణను అస్తిర పర్చే వారిపైనే తమ పోరాటం అని చంద్రబాబుపై విమర్శలను రాజకీయ కోణంలో చూడాలని కేటీఆర్ అన్నారు.