కరుణానిధి అంత్యక్రియల స్థల వివాదంపై అడ్డంకులు తొలగాయి. మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పును ఇచ్చింది. డీఎంకే పిటిషన్ దాఖలు చేసిన ఎమర్జెన్సీ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కరుణానిధి అంత్యక్రియలు నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ట్రాఫిక్ రామస్వాతితో పాటు మిగిలిన నలుగురు పిటిషనర్లు వేసిన పిటిషన్లను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.