రాజాజీ హాల్‌ వద్ద ఉద్రిక్తత...కార్యకర్తలపై లాఠీచార్జ్

Update: 2018-08-08 08:51 GMT

ద్రవిడ దిగ్గజం కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ దగ్గర పరిస్ధితులు అదుపుతప్పుతున్నాయి. కరుణానిధిని కడసారి చూసి నివాళులు అర్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో  పరిస్ధితులు ఉద్వేగ భరింతగా మారుతున్నాయి. అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. బలవంతంగా రాజాజీ హాల్‌లోకి వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో  పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. 
 

Similar News