కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించింది. అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమంటూ వైద్యులు ప్రకటించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కార్యకర్తల రోదనలతో కావేరీ ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ఆస్పత్రి వద్ద పోలీసులతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది.