కాసేపట్లో జయేంద్ర సరస్వతి మహాసమాధి

Update: 2018-03-01 04:03 GMT

శివైక్యం చెందిన కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కాసేపట్లో మహాసమాధి కానున్నారు. కంచి మఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే ఆయన మహాసమాధికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన పార్థీవ దేహాన్ని లక్ష మందికి పైగా భక్తులు సందర్శించారు. కంచి పీఠం జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఆలయాలతోపాటు విద్యాలయాలు, వైద్యాలయాలు అవసరమని భావించి వాటి స్థాపనకు ఆయన విశేష కృషి చేశారు.  

Similar News