రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు సస్పెన్షన్ అయ్యారు. కేవీపీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ పార్లమెంటు బయట, రాజ్యసభ లోపల ఆందోళన నిర్వహిస్తున్నారు. రాజ్యసభలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కేవీపీపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు.