రాష్ట్ర విభజనతో తెలంగాణ కూడా నష్టపోయింది: కేకే

Update: 2018-07-24 12:20 GMT

పార్లమెంట్‌ సాక్షిగా చేసిన చట్టాలను అమలు చేయనపుడు చట్టాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు టీఆర్ఎస్‌ ఎంపీ కే కేశవరావు. విభజన చట్టంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేశవరావు రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆయన హైకోర్టు అంశాన్ని ప్రస్తావిస్తే న్యాయశాఖ మంత్రి నవ్వుతున్నారని తెలిపారు. తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్ ఇస్తామని కేవలం 16వందల విద్యుత్ మాత్రమే ఇచ్చారని అన్నారు. 
 

Similar News