టెలికాం దిగ్గజం జియో మరో వినూత్న ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. 149 రూపాయల నుంచి 499 రూపాయల శ్రేణిలో గల అన్ని ప్రీ పెయిడ్ ప్లాన్లలోని వినియోగదారులకు అదనంగా 1.5 జిబి డేటాను ఆఫర్ చేస్తున్నట్లు జియో తెలిపింది. ప్రస్తుతం 149, రూపాయలు, 349 రూపాయలు, 399 రూపాయలు, 449 రూపాయల ప్యాక్లోని వినియోగదారులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుండగా దీంతో పాటు అదనంగా మరో 1.5 జిబి డేటా అందుకోనున్నారని ఈ అదనపు డేటా ఆఫర్ ఈ నెల 12 నుంచి 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో వెల్లడించింది.