పంతం నెగ్గించుకున్న జేడీఎస్‌

Update: 2018-05-31 10:07 GMT

కర్నాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మంత్రి పదవుల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు హోంశాఖ ఇచ్చేందుకు అంగీకరించిన కుమారస్వామి .. కీలకమైన  హోంశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థికశాఖను సీఎం కుమారస్వామి తీసుకోనుండగా, హోం శాఖ కోసం కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌తో పాటు మరి కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఆర్థిక శాఖ జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు రానున్నట్లు తేలింది. ఈ రోజు సాయంత్రం కర్ణాటక మంత్రివర్గంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మిగతా శాఖల బాధ్యతలు ఎవరెవరు చేపట్టనున్నారన్న విషయాన్ని వెల్లడించి, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 

Similar News