మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ ...అనంతపురంలో ఐదుగురు ఎమ్మెల్యేలను...
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో టిడిపి గెలవాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న 40 శాతం ఎమ్మెల్యేలను మార్చాలన్నారు జేసీ.
అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలను మార్చకుంటే పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంపీలకు ఎటువంటి పవర్ లేకుండా పోయిందన్నారు. ఎంపీలకు ఉండాల్సిన పవర్ మొత్తం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకే కట్టబెట్టారన్నారు.