పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు కొత్త కష్టాలు మొదలయ్యాయ్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై శశికళను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు విచారణ కమిటీ రెడీ అవుతోంది. శశికళను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామంటూ...ఇప్పటికే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు అధికారులకు జయ కేసును విచారిస్తున్న కమిటీ లేఖ పంపింది.