తృటిలో తప్పిన ప్రమాదం : విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Update: 2018-11-10 04:03 GMT

76మంది ప్రయాణీకులతో బయలుదేరిన  ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో కోలకతా విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు  ఎమర్జెన్సీ  ల్యాండ్‌ అయింది. శుక్రవారం గువహటికి వెళ్లా‍ల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. టేకాఫ్‌ తీసుకున్నకొన్నినిమిషాల్లోనే ఫైలెట్లకు ఈ విషయం అర్ధమైంది. దాంతో  అత్యవసరం ల్యాండ్‌ కు ఉపక్రమించారు. ఈ విషయాన్నీ  కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్  అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృవీకరించారు.  కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో లోపాన్ని గుర్తించినట్టు వారు చెప్పారు. పైలట్‌ల అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News