ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో బీజేపీ విజయం సాధించినా, అయితే ఇంత ఆనందంలోనూ భాజపాకు కొన్ని జిల్లాల ఓటర్లు ఇచ్చిన తీర్పు షాక్కు గురిచేసింది. ఆరు జిల్లాల్లో కనీసం ఒక్క స్థానమైనా గెలవలేని స్థితిలోకి జారిపోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. అమ్రేలీ, నర్మద, పోర్ బందర్, ఆనంద్, డాంగ్స్, తాపీ జిల్లాల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నవ్సారి, అర్వలి జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఏడు జిల్లాల్లో భాజపా, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బనస్కంత, కచ్, బొతాద్, ద్వారకా, ఖేడా, మహిసాగర్, సబర్కంత జిల్లాల్లో రెండు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి.