అందుకే ఒంగోలు గిత్త ఈ నిర్ణయం తీసుకున్నాడు..

Update: 2018-07-03 14:21 GMT

గతకొంతకాలంగా సరైనా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం గోపిచంద్  ప్రముఖ రచయిత కె. చక్రవర్తి ద‌ర్శ‌క‌త్వంలో 'పంతం' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గోపిచంద్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం జులై 5 న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ మూవీ తర్వాత  గోపిచంద్ ఓ వెరైటీ లవ్ స్టోరీని చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.  దీంతో ఇనాళ్లు యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న ఈ హీరోకి ఏమైంది.. ఎందుకు ఓ లవ్ స్టోరీలో నటించాలనుకుంటున్నాడు అంటూ సినీ పరిశ్రమల్లో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి గోపీచంద్ కు మాస్ హీరో అన్న ఇమేజ్ ఉంది. దీంతో  క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే ఈ ఒంగోలు గిత్త ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

Similar News