ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తుముకూరులో ఓపెన్టాప్ ఎస్యూవీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో సడెన్గా ఓ దండ వచ్చి ఆయన మెడలో పడింది. ఎవరో ముందుండి చాలా శ్రద్ధగా మెడలో వేసినట్లు ఆ పూలమాల పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాహుల్ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ పూలమాలను తొలగించి అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్షోను కొనసాగించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ నేతలు సామాజికమాధ్యమాల్లో పెట్టగా వైరల్గా మారాయి. గురిచూసి రాహుల్ మెడలో పూలదండ వేసిన అభిమానిని పలువురు మెచ్చకుంటుండగా.. మరికొందరు రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి.