హైదరాబాద్ కాచిగూడలో గ్యాంగ్ వార్ జరిగింది. నడిరోడ్డుపై ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వెంకటేశ్వరనగర్లో ఇరువర్గాలు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. గంటల తరబడి ఇరువర్గాలు కొట్టుకోవడంతో బస్తీవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్యాంగ్ వార్ వెనుక ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఓ కేసు పెట్టి వదిలేశారు. నడిరోడ్డుపై ఇంతపెద్ద గొడవ జరిగినా.. పోలీసులు పెట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బైక్ విషయంలో ఈ గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో రౌడీషీటర్లు కూడా ఉన్నారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఘటనలో రౌడీషీటర్లు ఎవరూ లేరని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు తిరిగి రాజీ చేసుకున్నారని, దీంతో పెట్టీ కేసు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.