నలుగురు రెబెల్స్‌పై టీఆర్ఎస్‌ వేటు

Update: 2018-11-30 09:14 GMT

తిరుగుబాటు జెండా ఎగరేసిన నలుగురు నేతలపై టీఆర్ఎస్‌ వేటు వేసింది. మాజీ మంత్రి జి.వినోద్‌, గజ్జల నగేష్‌, జలంధర్‌ రెడ్డి, శంకర్‌ని అధిష్టానం సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నలుగురిని సప్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్దిగా బరిలో ఉంటే 
గజ్జల నగేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెబల్‌గా పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి, 
శంకర్ షాద్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
 

Similar News