ఈనెల 27 న వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ఓ పర్యాయం అత్తిలి ఎమ్మెల్యేగా గెలిచిన అయన ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేస్తున్నారు. 27 న భీమవరంలో జరిగే బహిరంగసభలో వైసీపీలో చేరుతుననట్టు శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు.