ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Update: 2018-08-22 06:30 GMT

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్‌లో మంటలు చెలరేగడంతో పది మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ ఆధారంతో వారిని బయటికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 12 ఫైరింజన్ల రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయ్. 12 అంతస్తులో మొదలైన మంటలు చూస్తుండగానే 13, 14, 15 అంతస్తుల్లోకి వ్యాపించాయి. గాయపడిన నలుగురు వ్యక్తులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Similar News