శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. పురుషులతో పాటు మహిళలకూ కూడా సమాన హక్కులున్నాయని గుర్తుచేసింది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం మహిళా హక్కులకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదని అభిప్రాయపడింది కోర్టు. శబరిమల ఆలయంలోకి ఎవరైనా వెళ్లొచ్చని ఆలయాలు ప్రైవేట్ ప్రాపర్టీ కాదని తేల్చి చెప్పింది. ఆలయాల్లోకి వెళ్లి ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలిపింది సుప్రీంకోర్టు.