మహిళ గుండెలో సూది.. ఎలా వెళ్లిందో చూస్తే..

Update: 2018-06-16 01:01 GMT

వైద్యులు నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. వేసిన ఇంజక్షన్ సూది విరిగి గుండెభాగంలోకి వెళ్ళింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా రోదిస్తోంది. వివరాల్లోకివెళితే తమిళనాడు రాష్ట్రం కుంభకోణం కు చెందిన వడివేలు భార్య శశికళ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. గత మూడు నెలల కిందట  శశికళకు జ్వరం రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు చికిత్స చేసి ఇంజక్షన్ చేశారు వైద్యురాలు. అయితే వేసిన ఇంజక్షన్ విరిగి ఆమె చేతిలోనే ఉండిపోయింది. మరో రెండు రోజుల తరువాత శశికళ చేతినొప్పితో ఆసుపత్రికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు ఎక్స్ రే తీయగా శరీరంలో సూది ఉన్నట్టు గుర్తించామని దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని తొలగిస్తున్నట్టు చెప్పారు. ఇక మూడు నెలలు గడిచిన తరువాత సదరు మహిళకు గుండెనొప్పి రావడం, పైగా రోజు గుండెకు ఏదో గుచ్చుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ వైద్యులను సంప్రదించగా ఎక్స్ రే  తీస్తే గుండెభాగంలో సూది ఉన్నట్టు తెలిసింది.దీంతో ఆమె షాక్ కు గురైంది. శరీరంలో విరిగి ఉన్న సూదిని తీసివేశామని వైద్యులు మోసం చేశారని కన్నీటిపర్యంతమైంది. గుండెకు గుచ్చుకుంటున్న సూది ఏ క్షణాన ఏ అపాయం తెస్తుందోనని శశికళ రోదిస్తున్నారు. 

Similar News