ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడ సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు బాంబుతో పేల్చారు. బాంబు పేలుడికి నలుగురు జవాన్లు మృతిచెందగా, మరో ముగ్గురు గాయడ్డారు. మరో నాలుగురోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మావోయిస్టుల దాడి చత్తీస్ఘడ్లో తీవ్రకలకలం రేపుతోంది.