తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో చంద్రబాబు జోరుగా దూసుకపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో లో చంద్రబాబు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను తీసుకున్న చర్యలవల్లే ఈరోజు హైదరాబాద్ మహానగరం ఆదాయం పెరిగిందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ 165 కి.మీ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డుకు శ్రీకారం చుట్టామని, హైదరాబాద్ కు మెట్రో రైలు ప్రాజెక్టు తన కృషి వల్లే మంజూరైందని చంద్రబాబు చెప్పారు. కేవలం ప్రజలకోసం మరియు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తులందరూ ప్రజాకూటమిలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భారతదేశ ప్రధాని మోదీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.