కాంగ్రెస్లో ఓ వైపు బుజ్జగింపులు కొనసాగుతుండగానే మరో వైపు స్నేహపూర్వక పోటీలను నేతలు సిద్ధమయ్యారు . మహాకూటమి పొత్తుల్లో 94 స్ధానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు 99 మంది నామినేషన్లు దాఖలు చేసింది. మహాకూటమిలోని ఇతర పక్షాలు పోటీ చేస్తున్న ఐదు స్ధానాల్లో అభ్యర్ధులను పోటీకి దించింది. దుబ్బాక, మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్లో కాంగ్రెస్ వర్సెస్ టీజేఎస్గా పరిస్ధితి మారింది. మరో వైపు టీజేఎస్ తనకు కేటాయించిన ఎనిమిది స్ధానాలకు అదనంగా మరో 5 చోట్ల అభ్యర్ధులకు బీఫాంలు జారీ చేసింది.