అదిగో ఇదిగో అంటూ లీకులు వస్తున్నా కాంగ్రెస్లో సీట్ల పంచాయతి తేలడం లేదు. ఓ వైపు మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై రగడ జరుగుతుండగానే తుది జాబితా కోసం సమావేశమయిన స్క్రీనింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. రెండు రోజుల పాటు వరుసగా సమావేశమయిన స్క్రీనింగ్ కమిటీ రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. అశావాహులు అధికంగా ఉన్న స్ధానాలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్న కమిటీ సభ్యులు 20 నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే అధికంగా ఆశావాహులు ఉన్నట్టు గుర్తించారు. అసంతృప్త నేతలు, ఆశావాహులను బుజ్జగించించేందుకు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేపట్టారు. ఇదే సమయంలో అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ చేరుకున్న అసంతృప్తులు, ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.